కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంత భయంకరంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సోషల్మీడియా ద్వారా కష్టాల్లో ఉన్నవారి వివరాలు తెలుసుకొని.. తగిన సహాయం అందిస్తున్నారు. ఈసందర్భంగా రాజమౌళి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎలాంటి సహాయం కావాలన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ ఖాతాని ఫాలో కావాలని సూచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తగిన సహాయం అందించడానికి మా టీమ్ ప్రతీ క్షణం కష్టపడుతుంది. కరోనాకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలని ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ ఖాతాని ఫాలో అవ్వండి. అందులో తగిన సమాచారం తెలుసుకోండి. మీరు మీ చుట్టుపక్కల వారికి సహాయం చేయండి’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక దీనికి అజయ్ దేవగన్ స్పందించి రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పారు.
Thank you @ssrajamouli Sir and Team @RRRMovie for taking up this helpful initiative. It’s the need of the hour🙏🏼#CovidInfo #Covid19IndiaHelp https://t.co/rYRhISBtb0
— Ajay Devgn (@ajaydevgn) April 30, 2021
ఇక అజయ్ దేవ్గన్ కూడా తన వంతు తాను సాయం చేస్తున్నాడు. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలోని భారత్ స్కౌట్స్, గౌడ్ హాల్ ను 20 బెడ్లతో వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్టు, పారా మానిటర్స్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అజయ్ దేవ్గన్ తన సామాజిక సేవా సంస్థ ఎన్వై ఫౌండేషన్స్ ద్వారా ఈ ఏర్పాట్లు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: