సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది ఛార్మీ. దానికి కారణం కరోనానే కారణం. కరోనా సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. ఈనేపథ్యంలోనే ఛార్మీ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పాండమిక్ మరింత భయంకరంగా ఉంది..ఈ పరిస్థితులు చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదని, అందుకే కొద్దిరోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. అందరూ ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోండి.. అని అభిమానులకు సూచించింది. ‘నిజానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చాను. కానీ మన దేశం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకే ఇప్పుడు నేను సోషల్ మీడియాను వదిలేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ పోస్ట్ లో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఛార్మీ ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోకలిసి నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా నిర్మిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మొత్తం ముంబైలో ప్లాన్ చేశారు. ఈసినిమా కూడా ఎప్పుడో అయిపోవాలి.. గత ఏడాది కరోనా వల్ల ఒకసారి షూట్ కు బ్రేక్ పడింది.. మళ్లీ ఇప్పుడు మరోసారి బ్రేక్ పడింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























