కరోనా సెకండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకూ బాగానే పెరిగిపోతుంది. అన్ని పరిశ్రమలకు ఏమో కానీ కరోనా వల్ల సినీ పరిశ్రమ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ముంబైలో థియేటర్స్ బంద్ అయ్యాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఇక్కడ కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా తగ్గించాలని చూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహేష్అస్సలు వెనక్కి తెగ్గే పరిస్థితి కనపడట్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షుటింగ్ ను జరుపుకుంటుంది. ఇక దుబాయ్ లో చాలా వరకూ షూటింగ్ ను జరుపుకున్న ఈసినిమా తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నాకూడా మహేష్ టీం షూటింగ్ ను ఆపాలనుకోవడం లేదట. ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎప్పుడో ప్రకటించారు. అయితే గత కొద్దిరోజులుగా ఈసినిమా ముందే వచ్చే అవకాషం ఉందని.. అన్నీ కుదిరితే దసరా, దీపావళికి ఈసినిమా వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ ను త్వరగా పూర్తిచేయాలనుకుంటున్నాడని అంటున్నారు. అందుకే కరోనాను కూడా లెక్కచేయట్లేదన్న టాక్ వినిపిస్తుంది.
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: