దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కాస్త ఆందోళనకరంగానే మారింది. కరోనా అంటే అన్ని రంగాలు ఏమో కానీ సినీ రంగానికి మాత్రం కాస్త ఇబ్బందే. ఎక్కడి సినిమా షూటింగ్ లు అక్కడ ఆపేయాలి. థియేటర్స్ మూసేయాలి. దానికి తోడు సినీ సెలబ్రిటీలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత పదిరోజులుగా సెల్ఫ్ ఐసొలేషన్ లో భాగాంగా ఇంట్లోనే ఉంటూ చికిత్సను పొందుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రీసెంట్ గా ఆయనకు టెస్ట్ చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన పూర్తిగా కోలుకున్నారని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే ఆయన మళ్లీ తిరిగి స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవ్వనున్నారట.
ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తన తరువాత సినిమా ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ ఏప్రిల్ లో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పవన్ ప్రధాన పాత్రలో వస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి మాటలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: