కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోసారి దీని ఎఫెక్ట్ సినీ పరిశ్రమపైనే పడింది. ఇప్పటికే బాలీవుడ్ లో థియేటర్లు మూసేశారు. మరోవైపు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ పై కూడా దీని ప్రభావం ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇప్పటికే కరోనాకు భయపడి లవ్ స్టోరీ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఆసినిమా మరేదో కాదు కంగనా నటించిన తలైవి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక టీమ్గా ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశాము. ఛాలెంజింగ్ లాంటి ఈ ప్రయాణంలో సహకరించిన నటీనటులు, సిబ్బంది సహా అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాను పలు భాషల్లో నిర్మించడం జరిగింది. అన్ని భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయాలనుకుంటున్నాము. ఏప్రిల్ 23వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు పెరగడం, ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం వంటి ప్రభుత్వ చర్యలకు మద్దతివ్వాలని నిర్ణయించాం. ఈ కారణంగానే ‘తైలవి’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి.’ అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
Theater business can only be revived if theatres open 🙏@thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #HiteshThakkar @urstirumalreddy #RajatArora #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media @ZeeStudios_ #SprintFilms #GothicEntertainment pic.twitter.com/HZnkgFo3Au
— Kangana Ranaut (@KanganaTeam) April 9, 2021
కాగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: