తన సినీ కెరీర్ లో ఎంతో మంది వారసులను తెలుగు తెరకు పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు తమ ఇంటి వారసుడిని పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు ఆశిష్ రెడ్డి వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హుషారు’ వంటి యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క అప్ డేట్ కూడా లేదు. అయితే తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఎప్పటినుండో అనుకుంటున్నట్టే ఈ చిత్రానికి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ను ఖరారు చేసి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు. జూన్ 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Introducing #Ashish with #RowdyBoys 🤩
Get ready to relive your college days with the motion poster of ROWDY BOYS 💥
Love. Action. Drama.https://t.co/pMJQRkgAaa@anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic#RowdyBoysOnJune25th pic.twitter.com/670IroJ1NJ
— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2021
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. మరి ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చిన దిల్ రాజు తన వారసుడికి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: