పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. స్టార్ హీరోస్ తో పాటు యువ హీరోలతో జంటగా నటించి పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే ముంబై లోని బాంద్రా లో సీ ఫేసింగ్ 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఆ లావిష్ ఫ్లాట్ లో ఇంటీరియర్ డెకరేషన్ ను పూజాహెగ్డే స్వయంగా పర్యవేక్షించారు. తన పేరెంట్స్ తో ఎప్పుడూ కలసి ఉండే పూజాహెగ్డే ఆ ఫ్లాట్ లో ఒంటరిగా ఉండడం విశేషం. స్వంత ఫ్లాట్ లో రిలాక్స్డ్ గా ఉన్న ఫోటో ను పూజాహెగ్డే సోషల్ మీడియా లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: