మార్చి నెల మొత్తం వరుస సినిమాల రిలీజ్ లతో సందడిగా మారింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రంగ్ దే సినిమా కూడా ఒకటి. వెంకీ అంట్లూరీ దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎమున్నాయో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్
ఇప్పటివరకూ ఈకాంబినేషన్ లో సినిమా రాలేదు. అందులోనూ కీర్తి సురేష్ కూడా తెలుగులో ఇలాంటి యాక్టివ్ పాత్రలో నటించడం ఫస్ట్ టైమ్. మహానటి తరువాత చాలా వరకూ లేడీ ఒరియెంటెడ్ సినిమాలోచేసింది. ఇక ఈసినిమాలో నితిన్ కు జోడీగా నటిస్తుంది. అందులోనూ వీరిద్దరూ ఈసినిమాలో భార్య భర్తలుగా నటిస్తుండటంతో విశేషం. అంతేకాదు నితిన్ కూడా కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియాలో పలు కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. వీటినిబట్టి ఈసినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలాఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
వెంకీ అట్లూరి
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు రంగ్ దే అటూ మరో ఫ్రెష్ స్టోరీతో వస్తున్నాడు. లవ్ స్టోరీ లు తీయడంలో వెంకీ అట్లూరికి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాతో మరోసారి రంగ్ దే సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు.
సంగీతం
ఈసినిమాకు సంగీతం మరెవరో కాదు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి శ్రీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మ్యూజిక్ తోనే సినిమాను సగం హిట్ చేసేస్తాడు. రీసెంట్ గా వచ్చిన ఉప్పెన సినిమాతో మరోసారి తన సంగీతం పవర్ ఏంటో చూపించాడు. ఇక ఈసినిమాకు కూడా అదే రేంజ్ లో పాటలు, సంగీతం అందించాడు.
ఎడిటర్ నవీల్ నూలి
ఎడిటర్ గా నవీన్ నూలి ఎన్నో సినిమాలకు పనిచేశాడు. అంతేకాదు ఆమధ్య నాన్నకు ప్రేమతో సినిమాకు గాను నంది అవార్డ్ ను సొంతం చేసుకోగా.. రీసెంట్ గా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. జెర్సీసినిమాకు గాను ఎడిటర్ విభాగంలో నవీన్ కు నేషనల్ అవార్డ్ లభించింది. ఇక ఈసినిమాకు నవీన్ పనిచేస్తుండటంతో సినిమాకు కూడా మంచి క్రేజ్ పెరిగింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: