హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాకు కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆది.
భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. దర్శకత్వంతో పాటు ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా భాస్కర్ అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే నెలలో ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.
కాగా ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాకేత్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా ఆదిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: