ఏంటో ఈమధ్య ప్రభాస్ తన ఫ్యాన్స్ ను అస్సలు డిజప్పాయింట్ చేయట్లేదు. ఒకప్పుడు ఒక్క అప్ డేట్ రావడమే చాలా కష్టంగా ఉండేది.. కానీ ఈమధ్య తను సినిమాల విషయంలో స్పీడ్పప్ చేయడమే కాదు అప్ డేట్ ల విషయంలో కూడా అలానే ఉన్నాడు. శివరాత్రి సందర్భంగా పలు సినిమాల నుండి అప్ డేట్స్ వస్తాయని అందరూ ఎక్స్ పెక్ట్ చేసిందే. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ నుండి వస్తుందని మాత్రం ఎవరూ ఊహించనిదే. అయితే అందరికీ సర్ ప్రైజ్ ఇస్తూ ఈసినిమా నుండి పండుగ సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వింటేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ చాలా కాలం తరువాత మళ్లీ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Some call it madness, we call it love ♥️
This love story will forever be etched in your hearts! 💕
Team #RadheShyam wishes you all a very Happy #MahaShivratri! ✨#30JulWithRS #Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/zbYr7io05F— Prabhas (@PrabhasRaju) March 11, 2021
రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. . జూలై 30న ఈ సినిమాను విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: