కన్నడ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక బ్లాక్ బస్టర్ “చలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడవాళ్ళూమీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మిషన్ మజ్ను “మూవీ తో రష్మిక కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆర్ ఎస్ వి పి మూవీస్ బ్యానర్ పై శంతాను బాగ్చి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో హీరో సిద్ధార్ద్మల్హోత్రాకు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం “మిషన్ మజ్ను “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో సిద్ధార్ధ్ తో సెల్ఫీ తీసుకుని రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బాలీవుడ్లో కూడా రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్గా కొనసాగాలని కోరుకుందాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























