బ్లాక్ బస్టర్ “కెజిఫ్ చాప్టర్ 1” కన్నడ మూవీ తో దేశవ్యాప్తం గా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ మూవీ కి సీక్వెల్ “కెజిఫ్ చాప్టర్ 2 ” మూవీ ని తెరకెక్కించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ “సలార్ “ను తెరకెక్కిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేసి ప్రశాంత్ ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ పొందారు. నిన్న (9వ తేదీ ) అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ ఆఫీస్ లో ప్రశాంత్ నీల్ కలిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ మూవీ అనగానే అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురము లో .. “మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























