యంగ్ హీరో శర్వానంద్ నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. తన సినిమాల అప్ డేట్ లు ఇచ్చారు శర్వా దర్శక నిర్మాతలు. ప్రస్తుతం శర్వా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ ను నేడు ప్రకటించారు. ఎప్పటినుండో ఈసినిమాకు ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్న టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్గా ప్రకటించాడు. త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్న ఈసినిమాలో రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం శర్వా నటించిన శ్రీకారం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి11న ఈసినిమా రిలీజ్ కానుంది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: