దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata Movie Team Successfully Wraps Up Dubai Shooting Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Latest News,Sarkaru Vaari Paata Movie Team Wraps Up Dubai Shooting Schedule,Mahesh Babu,Keerthy Suresh,Super Star Mahesh Babu,SS Thaman Shares A Glimpse Of Mahesh Babu,Sarkaru Vaari Paata Team Wrap Up First Shooting Schedule,Sarkaru Vaari Paata Have Wrap Up Dubai Shooting Schedule,Mahesh Babu Wrap Up Sarkaru Vaari Paata First Schedule In Dubai,First Shooting Schedule Of Sarkaru Vaari Paata Wraps Up,Sarkaru Vaari Paata Dubai Shooting Schedule,Sarkaru Vaari Paata Movie Shooting Update

గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా వల్ల ఈ ఏడాది మాత్రం స్కిప్ చేసినట్టే. కరోనా వల్ల గత ఏడాది షూటింగ్ లు కూడా లేకపోవడంతో ఈ ఏడాది రావాల్సిన సినిమా వచ్చే ఏడాదికి వెళ్ళింది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ సినిమా తర్వాత పరుశురాం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే కదా. సినిమాకు చాలా కీలకమైన ఎపిసోడ్స్ కొన్ని ఇక్కడే చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లోనే పలు యాక్ష‌న్ స‌న్నివేశాలు, మ‌హేష్- కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది చిత్ర యూనిట్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని థమన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. దుబాయ్ లో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుంది..కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా కోసం ఎఫర్ట్స్ అందించిన నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను అని పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక తర్వాత షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.

 

View this post on Instagram

 

A post shared by thaman S (@musicthaman)

బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అంటే 2022 జనవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =