‘ఆచార్య’ లో విలన్ గా ‘జిషు సేన్ గుప్తా’

Jisshu SenGupta To Play The Villain In Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya,Acharya Movie,Acharya Film,Acharya Telugu Movie,Acharya Movie Telugu,Acharya Movie Latest Updates,Acharya Movie Latest News,Chiranjeevi Acharya,Chiranjeevi,Mega Star Chiranjeevi,Mega Star Chiranjeevi Acharya Update,Jisshu Sengupta,Actor Jisshu Sengupta,Jisshu Sengupta As A Villain In Chiranjeevi Acharya,Jisshu Sengupta To Take On Chiranjeevi,Jisshu Sengupta To Play The Villain In Acharya,Jisshu Sengupta Antagonist In Acharya,Jisshu Sengupta In Acharya,Koratala Siva,Ram Charan,Jisshu Sengupta As The Antagonist In Acharya,Jisshu Sengupta Villain In Acharya Movie

మొత్తానికి ఆచార్య ను ఢీ కొట్టగలిగే విలన్ దొరికాడు డైరెక్టర్ కొరటాల శివకు. షూటింగ్ దాదాపు పూర్తవ్వడానికి వస్తున్నా విలన్ పాత్రను మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. చిరుకు విలన్ గా జిషు సేన్ గుప్తాను సెలెక్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశ్వథ్థామ, భీష్మ సినిమాల్లో తన నటనతో మెప్పించిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా టాలీవుడ్ లో చిన్నగా మంచి మంచి అవకాశాలనే చేజిక్కించుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా అలాంటి భారీ అవకాశమే దొరికింది. తాజా సమాచారం ప్రకారం జిషు సేన్ గుప్తా ఆచార్య లో విలన్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విలన్ పాత్రలో పలువురు పేర్లు వినిపించినా.. పవర్ ఫుల్ పాత్ర కావడంతో.. చిరుని ఢీ కొట్టాలంటే జిషు సేన్ గుప్తా లాంటి వాళ్లైతేనే కరెక్ట్ అని భావించి అతనినే ఎంపిక చేశారట చిత్రయూనిట్.

కాగా కొరటాల శివ దర్శకాత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =