మంచి సినిమాలను.. నటనకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అతికొద్ది మంది నటీనటులలో శర్వానంద్ ఒకరు. ‘జాను’ సినిమా తర్వాత శర్వానంద్ ‘శ్రీకారం’ అనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. ఈ సినిమాలో శర్వానంద్ రైతు పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది కూడా. మహాశివరాత్రి పండుగ నాడు మార్చి 11న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.
Presenting the teaser of #Sreekaram! Good luck to the entire team for its release on March 11th 😊https://t.co/BWXy07BLvy@ImSharwanand @Im_bkishor @MickeyJMeyer @14ReelsPlus @RaamAchanta
— Mahesh Babu (@urstrulyMahesh) February 9, 2021
కాగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: