కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 13న రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా.తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. దీనితోపాటు వేదాళం రీమేక్ చేస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. ఈ రెండు సినిమాల తరువాత బాబి తో సినిమా చేస్తున్న సంగతి కూడా తెలుసు. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే లేదు.
Megastar @KChiruTweets garu & @dirbobby with @MythriOfficial 😍
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021
ఫైనాల్లీ ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. చిరు-బాబి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఇది స్ట్రెయిట్ సినిమా అని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























