ఇప్పటి వరకూ ఎక్కువ శాతం కామెడీ సినిమాలతో అలరించిన నవ్వించిన అల్లరి నరేష్ మొదటిసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రిన్స్ మహేష్బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.“ఇక్కడి చట్టాలు చేతకానివాడిపై వాడడం కోసమే. పవర్లో ఉన్నవాడ్ని ఏం పీకలేవు“ అనే డైలాగ్ తో కాన్సెప్ట్ అర్ధమవుతుంది. చేయని నేరానికి జైలుకెళ్లిన హీరో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు..? ఎలా బయటకు వచ్చాడు అనేది కథ. హీరోని కాపాడాలని ప్రయత్నించే లాయర్ గా శరత్ కుమార్ వరలక్ష్మి నటిస్తోంది. “అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది” అంటూ సాగిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
Happy to unveil the trailer of #Naandhi!! Looks intense… Wishing @allarinaresh and the entire team a blockbuster success. 😊@vijaykkrishna @varusarath5 @SV2Enthttps://t.co/0NI8Aa51Hk
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2021
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ నాంది అనే చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: