లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు మనవడు , హీరో హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ “బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా “రావణ్” మూవీ రూపొందనుంది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్ పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందనున్న మూవీ ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందనీ , కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ఇంతకు ముందు ద్విపాత్రాభినయం తో ప్రేక్షకులను అలరించిన హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు త్రిపాత్రాభినయం తో అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: