నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. అంతేకాదు చాలా ఏళ్ళ తర్వాత రేణు మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపింది రేణు. ఈ వెబ్ సిరీస్కు నిర్మాతలు డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇదిలా ఉండగా సినిమాలో మహేష్ బాబుకి వదినగా రేణుదేశాయ్ నటించబోతోందంటూ.. కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించగా..ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడుగగా.. ఆ వార్తల్లో నిజం లేదని.. తాను నటించట్లేదని ఈ రూమర్లు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో తెలియడం లేదు.. అంతకు ముందు ‘మేజర్’లో అని అన్నారు.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అంటున్నారు.. నిజంగా నటిస్తే మాత్రం తానే స్వయంగా ఇన్స్టాలో తెలియజేస్తానని తెలిపారు. మరి మొత్తానికి రేణు నటించట్లేదని తెలిసింది. ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: