పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “రాధేశ్యామ్ “మూవీ తరువాత ప్రభాస్ 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “తానాజీ” మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ “, బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , బ్లాక్ బస్టర్ “కెజి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్” మూవీ తెరకెక్కనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లోని ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరిగా స్టార్ హీరోయిన్ దిశా పటాని నటించే అవకాశం ఉంది. “సలార్” మూవీలో విలన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహామ్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరో గానే కాకుండా జాన్ అబ్రహామ్ విలన్ గా నటించిన “ధూమ్ “, “రేస్ 2 ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. జాన్ అబ్రహామ్ ప్రస్తుతం 3 బాలీవుడ్ మూవీస్ లో హీరోగా నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: