సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు “మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న”ఒక్కడు” మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన “ఒక్కడు” మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించిన ఎమ్ ఎస్ రాజు దర్శకుడిగా మారి “వాన “, “తూనీగ తూనీగ “, “డర్టీ హరి ” మూవీస్ ను తెరకెక్కించారు. “ఒక్కడు” మూవీ సీక్వెల్ కు ఎమ్ ఎస్ రాజు కథను సిద్ధం చేశారనీ , త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో నిర్మాత , దర్శకుడు ఎమ్ ఎస్ రాజు మాట్లాడుతూ .. సూపర్ హిట్ “ఒక్కడు” మూవీ కి సీక్వెల్ “ఒక్కడు2” మూవీ కై సన్నాహాలు ప్రారంభం అయ్యాయనీ , హీరో మహేష్ బాబు తో సంప్రదింపులు జరుపుతున్నామనీ, త్వరలోనే సీక్వెల్ మూవీ పై క్లారిటీ వస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: