టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ , బాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “మిషన్ మజ్ను” మూవీ తో బాలీవుడ్ కు రష్మిక ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయో పిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి శ్రీదేవి , మరో సావిత్రిగా పేరుపొందిన టాలెంటెడ్ యాక్ట్రెస్ సౌందర్య బయోపిక్ మూవీస్ రూపొందిందించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. హీరోయిన్ రష్మిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. శ్రీదేవి , సౌందర్య ల బయోపిక్ మూవీస్ లో అవకాశం వస్తే వదలుకోననీ , వారి బయోపిక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాననీ , శ్రీదేవి , సౌందర్య ల క్యారెక్టర్స్ తన డ్రీమ్ రోల్స్ అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: