ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో 2018లో సమ్మోహనం అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వీరి కాంబోలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. కెమెరాను రవి శంకర్ స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. రెగ్యులర్ షూటింగ్ ను కూడా వెంటనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
The first step towards our Dreams Begins today with a Formal Pooja Ceremony ✨
Our heartfelt thanks to honourable guests @DilRajuofficial, #VVVinayakGaru, @VenkyKudumula, RaviShankar (Mythri) @Sri_Avasarala, and everyone for your best wishes & blessings. pic.twitter.com/m4BwteSfI9
— Benchmark Studios (@benchmarkstudi5) January 4, 2021
కాగా ఈసినిమాలో సుధీర్ బాబు సరసన కృతిశిట్టి హీరోయిన్గా నటిస్తుంది. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్మార్క్ స్టూడియోస్ బ్యానర్పై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంచ్మార్క్ స్టూడియోస్ నిర్మిస్తోన్న తొలి చిత్రమిది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా పలాస ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాలో సుధీర్బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: