మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఇటీవలే ఈ రీమేక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్టుగా పేరుగాంచిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల 20న మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా సత్యదేవ్ నటిస్తున్నాడు. మరోవైపు చిరంజీవి చెల్లెలు పాత్రలో సుహాసిని యాక్ట్ చేయడం దాదాపు ఖరారు అయినట్టు సమాచారం.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా మోహన్ రాజానే. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. అంతేకాదు తమ్ముడు జయం రవితో ఎన్నో హిట్ సినిమాలను కూడా తెరకెక్కించాడు. మరి రీమేక్లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టున్న మోహన్ రాజా చిరుకు కూడా మంచి హిట్ ఇస్తాడేమో చూద్దాం.
ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: