టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలిలో నిన్న చరణ్, వరుణ్ ఒక్కసారిగా కరోనా పాజిటివ్ అని చెప్పడంతో మరోసారి అందరూ షాక్ కు గురవ్వడమే కాకుండా.. వారితో ఉన్న వారు ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు చరణ్ కూడా గత కొద్దిరోజులుగా తనతో ఉన్న వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనా టెస్ట్ చేయించుకోమని చెపుతుంది. అంతేకాదు తను టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. మొదటి సారి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నా అని చెప్పింది. అంతేకాదు.. తనతోటి వయసు వారికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అంటూ.. నేను కూడా టెస్ట్ చేయించుకునే ముందు చాలా ఆలోచించాను.. కానీ అమ్మ నా చేయి పట్టుకొని ఉంది.. మీరు మీ ఫ్రెండ్స్ ను కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసినప్పుడు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి.. సేఫ్ గా ఉండండి.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇక అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదోఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలే కూడా అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: