సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబాయ్ (వెంకటేష్ ), అబ్బాయ్ (రానా ) హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. హీరో వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు తో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , నాగచైతన్య తో “వెంకీ మామ “, వరుణ్ తేజ్ తో “F 3 :ఫన్ &ఫ్రస్టేషన్” మల్టీ స్టారర్ మూవీస్ లో హీరో వెంకటేష్ నటించగా ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్ , వరుణ్ తేజ్ ల “F 3″మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కుటుంబ కథా చిత్ర దర్శకుడు, సూపర్ హిట్ “శతమానం భవతి”మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న, వెంకటేష్ , రానా హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ కథను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కు వినిపించగా , ఆయన ఆ కథ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో వెంకటేష్ ప్రస్తుతం “నారప్ప “మూవీ, హీరో రానా “విరాటపర్వం”మూవీ , దర్శకుడు సతీష్ వేగేశ్న “కోతి కొమ్మచ్చి “మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీ కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: