రొటీన్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ కాదని మన హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అందుకే హీరోలు కూడా కొత్త కొత్త జోనర్ లు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే యంగ్ హీరో సాయి తేజ్ కూడా కొత్త జోనర్.. కొత్త కథతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ ఒక సినిమా చేస్తున్నట్టు తెలిసిందే. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర కథానాయకుడు సుప్రీమ్ హీరో సాయితేజ్ క్లాప్ నివ్వగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ దర్శకుడు కార్తీక్ దండుకు స్క్రిప్ట్ను అందజేశారు.
.@SVCCofficial‘s next with Supreme Hero @IamSaiDharamTej, the mystical thriller #SDT15 in association with @SukumarWritings has launched formally today with a pooja ceremony.
Screenplay : @aryasukku
Producer : @BVSNP
Story and Direction by @karthikdandu86 pic.twitter.com/lTePzAnLr9— SVCC (@SVCCofficial) December 24, 2020
ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు .
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్న సాయి తేజ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇక రీసెంట్ గా ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమాలు సాయి తేజ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాయో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: