“అందాల రాక్షసి “లావణ్య త్రిపాఠి “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “మూవీ లో సందీప్ కిషన్ కు జోడీగా లావణ్య నటించారు. ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. లావణ్య ప్రస్తుతం కార్తికేయ హీరో గా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా పరంగా లావణ్య తన ఆలోచనలను వెల్లడించారు. లావణ్య మాట్లాడుతూ .. స్టార్స్ తో నటించాలనే పరిమితులు విధించుకుంటే కెరీర్ లో ముందుకు సాగలేమనీ , అగ్ర హీరోలతో నటించలేదనే అసంతృప్తి తనలో లేదనీ , వచ్చిన అవకాశాలలో కొత్తదనం తో పాటు మంచి పాత్ర లు ఎంపిక చేసుకుంటున్నాననీ, మంచి పాత్రలో నటించామనే అనుభూతి ఉండాలనీ , అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంకిత భావంతో పాత్రకు న్యాయం చేయడానికి శ్రమించడమే తన విజయ రహస్యం అనీ , కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాననీ , సినీ పరిశ్రమలో విజయమే ముఖ్యం అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: