కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్గా హైదరాబాద్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కూడా పూర్తికానుంది. ఇటీవలే జయలలిత వర్థంతి సందర్భంగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా జయలలిత జీవితంలో ఎంజీఆర్ కీలక పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ రోజు ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తెల్ల దుస్తులు ధరించి ప్రజలకు అభివాదం చేస్తున్న, స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఇక అరవింద్ స్వామి లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: