ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిందో లేదో అప్పుడే మరో సినిమాను మొదలుపెట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనితోపాటు మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ను కూడా ఇటీవలే ఫిక్స్ చేసారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈరోజు మొదలు పెట్టారు. ఈ ఈవిషయాన్ని విక్రమ్ కుమార్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
#ThankYouTheMovie …SHOOT BEGINS! @chay_akkineni @MusicThaman @pcsreeram @BvsRavi @Vikram_K_Kumar #DilRaju #Shirish #HarshithReddy pic.twitter.com/ErxR550r2w
— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2020
కాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా, 2021 జులైలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్టు తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుల్ మోహన్ లు నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్న పేరు కూడా వినిపిస్తుంది. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
మరి ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: