కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళిసందడి ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని “పెళ్ళిసందడి ” మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో శ్రీకాంత్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా “పెళ్ళిసందడి ” మూవీని తెరకెక్కించి దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సంవత్సరాల తరువాత “పెళ్ళిసందడి ” మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ కె అసోసియేట్స్ , ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకంత్ తనయుడు రోషన్ హీరోగా “పెళ్ళిసందD ” మూవీ తెరకెక్కనుంది. మాళవిక నాయర్ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో హీరో శ్రీకాంత్ ఒక ప్రత్యేక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం. తండ్రీ తనయులు (శ్రీకాంత్ , రోషన్ ) ఒకే మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం “పెళ్ళిసందD ” మూవీ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: