కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మార్చిలోనే లాంఛనంగా ప్రారంభించారు.. అయితే అప్పుడే లాక్ డౌన్ కూడా రావడంతో సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అయితే షూటింగ్ చేయలేదు కానీ.. మ్యూజిక్ కంపొజిషన్స్.. ఇంకా ఇతర పనులు మాత్రం కానిచ్చేశారు. ఇక అక్టోబర్ లో చిన్నగా షూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె కూడా షూటింగ్ లో అడుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనుపమ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
కాగా ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక మలయాళ మూవీ “ప్రేమమ్ ” సినిమాతో వెండి తెరకు పరిచయమైన అనుపమ.. తెలుగులో “అ ఆ” మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయం తో ఆకట్టుకుంది. ఆ తర్వాత “శతమానం భవతి “, హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో పలు ప్రాజెక్ట్స్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా నటిస్తుంది. అంతేకాదు ఒక మలయాళ మూవీ కూడా చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: