పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. విడిపోయినా కూడా రేణు పవన్ అప్పుడప్పుడు కలుసుకుంటూనే వుంటారు. ముఖ్యంగా పిల్లలు కోసం పవన్ కూడా స్పెషల్ గా వారి దగ్గరకు వెళ్లిన సందర్భాలు వున్నాయి. అంతేకాదు రేణు కూడా పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో ఫొటో ను తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా అది అటు పవన్ అభిమానులను మాత్రమే కాదు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొన్ని అందమైన, ప్రత్యేకమైన ఫొటోలను అందరితో పంచుకోవాలి. కేవలం ఫోనులోని ఫొటో ఆల్బమ్కు పరిమితం కాకూడదు అని పిల్లలు అకీరా, ఆద్యతో కలిసి పవన్కల్యాణ్ దిగిన ఫొటోని పోస్ట్ చేసింది రేణు.
View this post on Instagram
ఇదిలా ఉండగా నటిగానే కాదు దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ఇప్పటికే ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి మరో సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్.
దానితో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది రేణు. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో డిఎస్. రావు, ఎస్. రజినీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: