నితిన్ మీద రివేంజ్ తీర్చుకోడానికి సిద్ధంగా ఉంది కీర్తి సురేష్.. అంతేకాదు అందుకు నితిన్ ను కూడా రెడీ గా ఉండమంటుంది.. అసలు కీర్తి ఈ రివేంజ్ తీర్చుకోడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం దుబాయ్లో రంగ్ దే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో షూటింగ్ మధ్యలో కీర్తీ సెట్లో రెస్ట్ తీసుకుంటుండగా ఆ సమయంలో నితిన్, వెంకీ అట్లూరి ఓ ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సంగతి కూడా విదితమే. అంతే కాకుండా ‘షూటింగ్తో మాకు చెమటలు పడుతుంటే తను మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది’ అని కామెంట్ కూడా చేశారు. అయితే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వారు చేసిన పనికి వారిపై పగ తీర్చుకుంటానని చెప్పింది. చెప్పినట్టుగానే డైరెక్టర్ వెంకీ అట్లూరిని సినిమా సెట్లో పరుగులు పెట్టించింది. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. `ఒకరి పని అయింది.. ఇంకొకరు ఉన్నారు. నితిన్.. త్వరలోనే నీపై పగ తీర్చుకుంటాన`ని కామెంట్ చేసింది.
View this post on Instagram
కాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ మొదలు పెట్టనుంది. దానితో పాటు మరో తమిళ్ సినిమా కూడా చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: