అమెరికాలో అరుదైన అవార్డ్ దక్కించుకున్న ‘నువ్వు తోపురా’
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు సుధాకర్. ఇక ఆ తర్వాత ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’, ‘నువ్వు తోపురా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు నువ్వు తోపురా సినిమాకు అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమా అమెరికాలో అరుదైన అవార్డ్ ను సొంతం చేసుకుంది. యూటా ఫిలిం ఫెస్టివల్ 2020 లో మేడ్ ఇన్ యూటా ఫీచర్ కేటగిరీలో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డును దక్కించింది. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్య హీరోయిన్ గా నటించింది. యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డీ శ్రీకాంత్ నిర్మించిన ఈసినిమాలో 90 దశకాల్లో యువతను ఆకట్టుకొన్న హీరోయిన్ నిరోషా ప్రధాన పాత్రలో నటించింది.
హైదరాబాద్ లో “కెజిఎఫ్ 2” షూటింగ్
కెజిఎఫ్ చాఫ్టర్ 1″మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో యశ్ , శ్రీనిధి శెట్టి లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ , రవీనా టాండన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈషెడ్యూల్ తో “కెజిఎఫ్ చాప్టర్2 “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.
‘సన్ ఆఫ్ ఇండియా’ – హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా. అందుకే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా తిరుపతిలో మొదటి షెడ్యూల్ను చిత్ర బృందం పూర్తి చేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు.
‘కపటధారి’ సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు ‘కపటధారి’ అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు క్రిస్మస్ కానుకగా థియేటర్లో కపటధారి విడుదల కానుందని మూవీ యూనిట్ ప్రకటించింది.
#Kapatadhaari Censored U/A. Releasing this Christmas… in theatres! @Directorpradeep @Nanditasweta @vennelakishore@simonkking @bhashyasree@vamsikaka@CreativeEnt4 @adityamusic @Dhananjayang pic.twitter.com/I8rYM7rSGQ
— Sumanth (@iSumanth) November 24, 2020
6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
ఇప్పటికే ట్విట్టర్లో మహేష్ దాదాపు 11 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 60 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకుని 6 మిలియన్ క్లబ్బులో చేరాడు. తను ఇన్ స్టాలోకి వచ్చి ఎంతో కాలం కానప్పటికీ, అత్యంత వేగంగా ఇంతమంది ఫాలోవర్లను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి.
“సీటీమార్” షూటింగ్ పునః ప్రారంభం
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముందు 60 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “సీటిమార్ “మూవీ షూటింగ్ 8 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది.
శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి
నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
Wrapped up #Sharwa30 shoot 😊 @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i
Directed by Shree Karthick
Music by @JxBe
Cinematography by Sujith Sarang
Dialogues by @TharunBhasckerD
Produced by @DreamWarriorpic @prabhu_sr pic.twitter.com/MNdQdUZRIn— Sharwanand (@ImSharwanand) November 24, 2020
క్రైమ్ డ్రామాగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా
తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఇక ఇప్పుడు తాజాగా తన మూడో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపాడు.
View this post on Instagram
‘ఢీ’ సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్
విష్ణు బర్త్డే సందర్భంగా ఢీ సీక్వెల్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ సారి “డబుల్ డోస్”(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక ‘ఢీ’ కి పనిచేసిన గోపి మోహన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం.
Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd
— Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020
నాగశౌర్య కు జోడీగా సంచలన గాయని షర్లీ సేతియా
డైరెక్టర్ అనీష్ కృష్ణతో నాగశౌర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి జరగనుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఆక్లాండ్కు చెందిన, ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందిన సంచలన గాయని, నటి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగశౌర్య జోడీగా ఎంపికయ్యారు. ‘మస్కా’తో నటిగా మారిన షిర్లీ, త్వరలో ‘నికమ్మా’ చిత్రంతో బాలీవుడ్లోనూ పరిచయం అవుతున్నారు.
శింబు ‘మానాడు’ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
‘సర్కారు వారి పాట’ గ్రాండ్ లాంచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది.
Super star @urstrulymahesh & @KeerthyOfficial starrer #SarkaruVaariPaata Pooja took place today!
Regular shoot commences from 1st Week of Jan 2021
Clap by #SitaraGhattamaneni
Camera Switched on by #NamrataMahesh@ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus pic.twitter.com/HmUGBLMCmr— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2020
నాని 28 టైటిల్ రిలీజ్
బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.
For all the fun you have lost in 2020, we promise to make it up in 2021 😁
Presenting the #CurtainRaiser of #Nani28 ✈️https://t.co/4uDnpfPtG7
Shoot commences soon!#AnteSundaraniki @nameisnani #NazriyaFahadh #VivekAthreya
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: