26/11 ఘటన గుర్తుచేసుకున్న అడివి శేష్

Actor Adivi Sesh Pays Tributes To Martyrs Of 24/11 Attack On Instagram

ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ రోజు 26/11 కావడంతో మరోసారి అడివి శేష్ ఆ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. దాదాపు ఈ ఘటన జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో తన ఇన్స్టాలో ముంబై హోటల్ పిక్ పోస్ట్ చేసి… ఆ ఘటనలో చనిపోయిన బాధితులకు అలానే అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నట్టు పోస్ట్ చేసాడు.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

కాగా మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘ద‌బాంగ్ 3’ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇంకా `గూఢ‌చారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్ర‌లో కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =