ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు 26/11 కావడంతో మరోసారి అడివి శేష్ ఆ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. దాదాపు ఈ ఘటన జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో తన ఇన్స్టాలో ముంబై హోటల్ పిక్ పోస్ట్ చేసి… ఆ ఘటనలో చనిపోయిన బాధితులకు అలానే అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నట్టు పోస్ట్ చేసాడు.
View this post on Instagram
కాగా మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘దబాంగ్ 3’ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా `గూఢచారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: