ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నా సినీ సెలబ్రిటీస్ ను.. వారి కుటుంబాలను మాత్రం వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది కోలుకున్నా కొంతమంది మాత్రం మృతి చెందారు. ఇక ఇటీవలే తమన్నా పేరెంట్స్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి పేరెంట్స్ కూడా కరోనా బారిన పడ్డారు. వారు ఎవరో కాదు ఛార్మీ కౌర్ పేరెంట్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ విషయాన్ని ఛార్మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసింది. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గరనుండి మేము నిబంధనలు పాటిస్తూ.. చాలా జాగ్రత్తగా ఉన్నాము. అయినా దురదృష్టం కొద్దీ వారు కరోనా బారిన పడ్డారు… బహుశా హైదరాబాద్ వరదల మూలాన ఇది జరిగి ఉంటుంది. ఇప్పటికే మా నాన్నకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈ వార్త విని చాలా భయపడ్డాను.. వెంటనే అమ్మానాన్న ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నాకు చాలాకాలంగా తెలిసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చికిత్స అందిస్తున్నారు. వైద్య బృందం వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం నా తల్లిదండ్రులు చికిత్సకు స్పందిస్తున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఫైనల్ గా ఒకటే సలహా ఇస్తున్నాను. మీకు కరోనా లక్షణాలుంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. ముందే గుర్తించగలిగితే చాలావరకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నేను నా తల్లిదండ్రులను తిరిగి ఆరోగ్యంతో చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. ఆ దుర్గామాత మిమ్మల్ని చెడు నుంచి రక్షించి సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరెంట్స్ త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయండి” అని చార్మీ అభిమానులకు సూచించారు.
I thank @AIGHospitals and it’s total team for all the care they are taking of parents to fight #coronavirus 🙏🏻
Doctor NAGESHWAR REDDY u r my hero 🙏🏻 pic.twitter.com/OmloT8r8Sr
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: