కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి గత కొద్దిరోజులుగా చిత్రీకరణలో ఉన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో 20 రోజులుగా నాన్ స్టాఫ్ గా షూటింగ్ లోనే ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో నూతన దర్శకుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ దర్శకత్వంలో కూడా తెలుగు, తమిళ్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: