సూపర్స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో మరింత యాక్టీవ్ గా తయారయ్యారని చెప్పొచ్చు. ఎప్పుడో ఒకప్పుడో ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జాతీయ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ధైర్యవంతులైన వాయిసేన సిబ్బందికి వందనం తెలిపారు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు పనిచేస్తున్న సైనికులందరికి రుణపడి ఉన్నాం అని తన ట్వీట్లో తెలిపారు. కాగా ఈ ఏడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Saluting our brave IAF Personnel on the occasion of Indian Air Force Day. We owe our peace and freedom to all the soldiers safeguarding our national security. 🙏🙏 #IndianAirForceDay
— Mahesh Babu (@urstrulyMahesh) October 8, 2020
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: