బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం “లవ్ స్టోరీ “, “విరాటపర్వం ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను సాయి పల్లవి ఎంపిక చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రకృతి ఆరాధకురాలు. ప్రకృతి ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్ట్ లు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా గా సాయి పల్లవి కొండల్లో జలపాతం వద్ద స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. సాయి పల్లవి ఊడలు పట్టుకుని ఊగుతూ డార్విన్ జీవపరిమాణ సిద్ధాంతానికి రుజువు అంటూ తన ఫోటోను షేర్ చేశారు. ప్రకృతి ఆస్వాదనలో ఉన్న సాయి పల్లవి ఫొటోస్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: