టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా సుమారు 6 నెలల తరువాత టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలయ్యింది. స్టార్ హీరోయిన్ రష్మిక ఈ రోజు నుండీ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభం నుండీ అభిమానులు తనపై ప్రేమ , అభిమానం చూపిస్తున్నారనీ, వారి ఆప్యాయతకు వెలకట్టలేననీ, అభిమానులకు “రోషియన్స్”అనే పేరు పెడుతున్నాననీ , లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశాననీ , సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఎప్పుడూ టచ్ లోనే ఉన్నారనీ , అభిమానుల ప్రేమ , అభిమానం తనకు బలం గా నిలిచిందనీ రష్మిక చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: