టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. దాదాపు చాలా మంది ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ అయితే ఏకంగా ఇటలీకి పయనమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా శర్వా కూడా షూట్ ను స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు ఇంకా టైటిల్ పెట్టని తెలుగు, తమిళ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. దాదాపు 8 నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చినట్టు చెపుతూ.. సెట్ లో ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసాడు.
Back to work after 8 months for my Telugu – Tamil Bilingual film with Director Shree Karthick and Producer @prabhu_sr ❤️ pic.twitter.com/d1aQLoFfxg
— Sharwanand (@ImSharwanand) October 1, 2020
కాగా ఈ సినిమాకు నూతన దర్శకుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: