ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా త్వరలోనే షూట్ ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ కోసం వెయిట్ చేయలేను అంటుంది పూజా హెగ్డే.
అయితే ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలు కానుంది అని తెలుపుతూ దర్శకుడు రాధా కృష్ణ గత ఆగష్ట్ నెలలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ట్వీట్ కు పూజా రీ ట్వీట్ చేస్తూ.. రాధే శ్యామ్ షూటింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నానని అదే సెట్ లో రెండు పుట్టినరోజులు ఉన్నాయని రిప్లై ఇచ్చింది. ఆ రెండు పుట్టినరోజులు ఎవరివో కాదు.. ప్రభాస్ అండ్ పూజాలవే.. పూజా పుట్టినరోజు అక్టోబర్ 13న.. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. సో ఈ ఇద్దరు తమ పుట్టినరోజులు రాధే శ్యామ్ సెట్ లోనే జరుపుకోనున్నారు. చూద్దాం మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారో.
Can’t waitttt to resume shoot with all of you…🕰😬🕰 with two birthday’s on set too! 😂🥳 #RadheShyam https://t.co/CJmfJwkHg3
— Pooja Hegde (@hegdepooja) September 24, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: