సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా

Actor RajTarun Once Again Teams Up With Orey Bujjiga Movie Director

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు. విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒరేయ్ బుజ్జిగా సినిమా డైరెక్టర్ తోనే మరోసారి రాజ్ తరుణ్ సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఈ రోజే సింపుల్ గా హైదరాబాద్ లో ఈ సినిమాను లాంచ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక విజయ్ కుమార్ తో చేస్తున్న రెండవ సినిమా వనమల్లీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో రూపొందుతోంది.

కాగా ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్‌తరుణ్ తక్కువ సినిమాలతోనే తనదైన ముద్ర వేశాడు. సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్, ఈడో రకం ఆడో రకం లాంటి సినిమాలు అతడికి మంచి గుర్తింపు నిచ్చాయి. అయితే ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాలు డిజాస్టర్లుగా మిగలడంతో రాజ్ తరుణ్ గ్రాఫ్ కూడా పడిపోయింది. మరి ఈ సినిమా ఎంతవరకూ రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.