థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల ‘వి’ సినిమా అయింది. నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా ఓటీటీ లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు రానా ‘విరాట పర్వం’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కు మొదటినుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే షూటింగ్ కు కూడా లేట్ అవుతుంది. ఇక త్వరలోనే మళ్ళీ షూటింగ్ ను మొదలు పెట్టాలన్న ప్లాన్ లో వున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ త్వరగా ముగించేసి ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. థియేటర్ లోనే ‘విరాట పర్వం’ సినిమాను రిలీజ్ చేస్తామని అంటున్నారు చిత్ర యూనిట్.
మరి ఇప్పటికే షూటింగ్ ముగించుకొని ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపైనే ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ సినిమా షూటింగే ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. షూటింగ్ పూర్తయ్యేలోపు థియేటర్స్ కూడా తెరుచుకోవచ్చు.. చూద్దాం అప్పటివరకూ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: