టాలీవుడ్ లో ఉన్న వన్ అఫ్ ద పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ కపుల్స్ లో మహేష్ అండ్ నమ్రత పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక మహేష్ బాబు అయితే ఫుల్ ఫ్యామిలీ పర్సన్. షూటింగ్ లు లేకపోయినా.. షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేస్తాడు. ఇక ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఖాళీ టైం దొరికింది. చక్కగా పిల్లలతో ఆట పాటలతో సినిమాలు చూస్తూ జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వాటికి సంబంధించిన ఫొటోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో పిక్ పోస్ట్ చేసింది. అయితే ఈ సారి మహేష్ తను వున్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ప్రేమపై తనకున్న అవగాహన ఏంటో కూడా చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన ఉనికికి మూల కారణం ప్రేమ.. ప్రేమ మాత్రమే మనం సంతోషంగా ఉండేలా చేస్తుంది. దయ,జాలి, కరుణ అనేవి ప్రేమ నుండి వచ్చే ఎమోషన్సే.. ప్రేమ నిజమైనది. ప్రేమపై ఉన్న నాకున్న అవగాహన ఇది.. కాబట్టి ప్రేమగా ఉండండి..ప్రేమతో ఉండండి. మనం జీవించడానికి ఒక జీవితమే ఉంది.. దానికోసం సంతోషంగా, సురక్షితంగా ఉండండి. నా సంతోషానికి, నాప్రేమకి ఇదే కారణం అంటూ తెలిపింది. మరి ఈ ఫొటో చూస్తేనే అర్ధమవుతుంది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో. ఇంకో విషయం ఏంటంటే ఇది కూతురు సితార క్లిక్ మనిపించిన ఫొటో అట.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: