రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పాల్గొని పూర్తి చేశారు. కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఛాలెంజ్ను పూర్తి చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ లో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ మొక్కలు నాటి ఆ తర్వాత రానా, రామ్ చరణ్, శ్రద్దా దాస్ నామినేట్ చేసాడు. రానా ఇప్పటికే తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. ఇక మూడు నెలల తర్వాత ప్రభాస్ నుంచి ఛాలెంజ్ను స్వీకరించిన శ్రద్ధా కపూర్ ఈ రోజు ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. తనను నామినేట్ చేసినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెపుతూ.. సమాజానికి ఎంతో మేలు చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళుతున్న రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
కాగా బాలీవుడ్ లో దూసుకుపోతున్న శ్రద్ద సాహోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లాక్డౌన్ ముందు టైగర్ ష్రాఫ్ తో నటించిన భాగీ 3 సినిమా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత లాక్ డౌన్ విధించడంతో సినిమాను థియేటర్స్ నుండి తీసేయాల్సి వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: