తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పాలెం లో సముద్ర తీరాన కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మహిమాన్వితమైనది. క్రీస్తు శకం 300 సంవత్సరాల పూర్వం నిర్మించబడిన ఆ ఆలయంలో లక్షలాది ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి. అంతర్వేది లో స్వామి వారి రథ యాత్ర , తీర్థం ప్రతీ సంవత్సరం వైభవంగా జరుగుతాయి. మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనం లో ఉండే ఈ ఆలయం ప్రస్తుతం ధర్మా దాయ శాఖ ఆధ్వర్యంలో పూజలందుకొంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Tomorrow evening between 5.30- 6.30 pm; please light a lamp for Sanatana Dharma and Religious Harmony. And take a photo or video and upload on this hashtag#Bharathiya_culture_matters pic.twitter.com/ms7jHFDxVj
— Pawan Kalyan (@PawanKalyan) September 10, 2020
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం సెప్టెంబర్ 5వ తేదీ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. ఈ సంఘటన యాధృశ్చికంగా జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం దాగివుందా అనే విషయంపై రాష్ట్ర ప్రభుతం సి బి ఐ ఎంకైరీ కై ఆదేశించింది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై స్పందించి సనాతన ధర్మం , మత సామరస్యం కై హిందువైన ప్రతీ ఒక్కరూ ఈ రోజు సాయంత్రం 5:30 PM నుండి 6:30 PM వరకూ ఒక దీపం వెలిగించాలని కోరారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలియ జేస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: