బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2 ” మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కు అధిక సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. స్టైలిష్ మూవీ “సాహో “బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో ఉత్తరాది లో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ “ఆదిపురుష్ ” అనౌన్స్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో 3D ఫిల్మ్ “ఆదిపురుష్ ” హిందీ , తెలుగు భాషలలో రూపొందనుంది. తమిళ , కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. “ఆదిపురుష్ ” మూవీ లో రాముడిగా ప్రభాస్ , రావణుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీ కి విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ కు “అవతార్ “, స్టార్ వార్స్ “వంటి హాలీవుడ్ మూవీస్ కు పనిచేసిన టీమ్ ను ఎంపిక చేశారు. ఒక స్టూడియో లో గ్రీన్ మ్యాట్ సెటప్ తో చిత్రీకరణ జరుపుకోనున్న “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. “రాధేశ్యామ్ “మూవీ 2021 సంవత్సరంలో , నాగ్ అశ్విన్ మూవీ , “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయని సమాచారం. సుమారు 500 కోట్ల బడ్జెట్ లో రూపొందనున్న “ఆదిపురుష్ ” మూవీ పైభారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: